Site icon TeluguMirchi.com

అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ!

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే సీరీస్ లో భాగంగా రేపు ఉదయం తొలి మ్యాచ్ సిడ్నీలో ప్రారంభం కానుంది. ఇదే వేదికపై రెండు వన్డేలు జరుగనుండగా, వన్డే సిరీస్ లో చివరిదైన మూడవ మ్యాచ్ కాన్ బెర్రాలో జరుగుతుంది. ఈ సీరీస్ ద్వారా కోహ్లీ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఊరిస్తున్న ఈ రికార్డును కోహ్లీ కచ్చితంగా సాధిస్తాడని అతని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయికి కోహ్లీ 133 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్ లలో కోహ్లీ 133 పరుగులను మించి సాధిస్తే, ఆ ఘనత సాధించిన ఆరవ ప్రపంచ క్రికెటర్ గా నిలుస్తాడు.  

Exit mobile version