Site icon TeluguMirchi.com

ధోని సేన ఓటమి

ఐపీఎల్‌-13లో  సీఎస్‌కే కి తొలి అపజయం ఎదురైయింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కే 200 పరుగులు వరకూ వచ్చి ఆగిపోయింది. ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది.

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడినా డుప్లెసిస్‌(72 , ) ఎంఎస్‌ ధోని(29 నాటౌట్‌;)లు అలరించారు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే, చివర్లో ధోని బ్యాట్‌కు పనిచెప్పాడు. కాగా, అప్పటికే నష్టం జరిగిపోవడంతో సీఎస్‌కే ఓటమి తప్పలేదు. కాగా, టామ్‌ కరాన్‌ వేసిన చివరి ఓవర్‌లో ధోని హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు.   

Exit mobile version