Site icon TeluguMirchi.com

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మృతులంతా రాపర్ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు.

దుర్ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటన గురించి అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Exit mobile version