Site icon TeluguMirchi.com

ఏపీ మందు బాబులకు బాడ్ న్యూస్


లాక్‌డౌన్ వల్ల మూసివేతకు గురైన మద్యం దుకాణాలను ఏపీ సర్కార్ తెరుస్తుంది. ఈ సందర్భంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరోసారి పాతిక శాతం ధరలను పెంచింది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి.. షాపుల వద్ద రద్దీని తగ్గించడానికి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

మద్యం ధరలను 25 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం.

Exit mobile version