Site icon TeluguMirchi.com

లక్షన్నరకి దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 6387 కేసులు, 170మరణాలు సంభవించాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,51,767కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 4337 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 64,426మంది కోలుకోగా మరో 83,004మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.

Exit mobile version