
‘ఐరోపా ఖండంలో మహమ్మారికి సంబంధించి స్లొవేనియాలోనే పరిస్థితి అత్యుత్తమంగా ఉంది. కరోనా ముగిసిందని ప్రకటించేందుకు ఇదే మమ్మల్ని పురిగొల్పింది’ అని ఆ దేశ ప్రధాని జానెజ్ జాన్స అన్నారు. కరోనా వైరస్తో చిగురుటాకులా వణికిన ఇటలీకి స్లొవేనియా సరిహద్దు దేశం కావడం గమనార్హం.
