
ఏడాది చివరి వరకు ఇంటి నుంచే పనిచేయాలని ఎక్కువ మంది ఉద్యోగులను ఫేస్బుక్ ఆదేశించింది. అయితే ఏయే విభాగాలకు చెందిన వారిని కార్యాలయాల్లోని అనుమతిస్తారో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కార్యాలయాలను తెరిచేందుకు ప్రజారోగ్య సమాచారం, ప్రభుత్వ మార్గనిర్దేశాలు, స్థానిక నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటామని ఫేస్బుక్ తెలిపింది.
ఎక్కువ మంది ఉద్యోగులు ఏడాది చివరి వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు గూగుల్ సైతం నిర్ణయించిందని సమాచారం. ఇక ఏడాది సాంతం ఇంటి నుంచే పని చేయాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అందరితో నిర్వహించిన సమావేశంలో అన్నారు.
