భారత్‌, ఆస్ట్రేలియా తొలి టెస్టులో భారత్‌ ముందంజ


భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట పూర్తయింది. 77/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా ఆట ముగిసేసమయానికి 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్‌ శర్మ (120) సెంచరీతో ఆకట్టుకున్నాడు. జడేజా (66*), అక్షర్‌ (52*) నిలకడగా ఆడి హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్‌ బౌలర్లలో మర్ఫీ 5 వికెట్లు తీయగా.. కమిన్స్‌, నాథన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం భారత్‌ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది.