IND w Vs AUS w : పోరాడి ఓడిన టీమిండియా.. ఫైనల్ కు చేరిన ఆసీస్


మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళా జట్టు, సెమీ ఫైనల్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. మరోసారి ఆసీస్ చేతిలో భారత్ కు పరాభవం తప్పలేదు. ఉత్కంఠభరితమైన పోరులో 5 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఏడోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి చేరుకుంది. ఇక ఫీల్డింగ్‌లో చేసిన తప్పులు, క్యాచ్ డ్రాప్‌లకు భారీ మూల్యం చెల్లించుకుంది భారత మహిళా జట్టు.