Site icon TeluguMirchi.com

ఆ జిల్లాల ప్రజలకు పోలీసులు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి లాక్ డౌన్ చేపట్టింది. జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరంలో లాక్ డౌన్ ను విధించారు.కేసులు పెరుగుతున్న వేళ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.

 ఉదయం 11 గంటల వరకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 11 గంటల తరువాత ఎవరూ కూడా బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  ఒకవేళ నిర్ణయించిన సమయం తరువాత బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ..భారీ జరిమానా విధిస్తామని, బళ్ళు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.  

Exit mobile version