Site icon TeluguMirchi.com

జగన్ పై నాని ఫైర్

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థ తీరును తప్పుపడుతూ పార్లమెంటు ప్రాంగణంలో నిన్న వైసీపీ ఎంపీలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కేశినేని నాని స్పందిస్తూ, ఏ అంశం మీదనైనా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే దానికి కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయతీ అని చెప్పారు. దానికి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

‘జగన్ గారూ, రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం మీ ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారు. చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటిపైన పోరాటం చేయండి’ అని కేశినేని పేర్కొన్నారు.

Exit mobile version