Site icon TeluguMirchi.com

ఏపీ లో కొత్తగా 6617 కరోనా పాజిటివ్ కేసులు

Corona Tracker

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో 101,544 కరోనా పరీక్షలు నిర్వహించగా 6617 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,26,751 మంది వైరస్‌ బారిన పడగా మొత్తం 71,466 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,228 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 17,43,176 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో 57 మంది మరణించారు, దీంతో రాష్ట్రంలో కొవిడ్ వల్ల 12,109 మంది మరణించారు.

Exit mobile version