Site icon TeluguMirchi.com

ఏపీలో కొత్తగా 3263 కరోనా కేసులు, 11 మరణాలు

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,263 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,28,644 మంది వైరస్‌ బారిన పడగా మొత్తం 23,115 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1,091 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8,98,238 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో 11 మంది మరణించారు, దీంతో రాష్ట్రంలో కొవిడ్ వల్ల 7,311 మంది మరణించారు.

Exit mobile version