Site icon TeluguMirchi.com

ఏపీ కరోనా అప్డేట్ : ఒకేరోజు 18 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,949 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 814774కి చేరింది. ఇందులో 781509 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 26622 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18మరణాలు సంభవించాయి.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు చూస్తే.. అనంతపురం 192, చిత్తూరు 315, తూర్పుగోదావరి 417, గుంటూరు 421, కడప 193, కృష్ణా 457, కర్నూలు 32, నెల్లూరు 76, ప్రకాశం 99, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 114, విజయనగరం 67, పశ్చిమ గోదావరి 492 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,554కి చేరింది.

Exit mobile version