Site icon TeluguMirchi.com

రేపే ఏపీ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్‌ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version