Site icon TeluguMirchi.com

బీజేపీ జాతీయ అధ్యక్షుడికి స్వైన్ ఫ్లూ..

దేశ వ్యాప్తంగా చలి ప్రభావం ఎక్కువ అవడం తో స్వైన్ ఫ్లూ వ్యాధి విలయతాండవం చేస్తుంది..సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ వ్యాధి తో బాధపడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన డాక్టర్స్ సలహా మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు స్వైన్ ఫ్లో సోకిందని.. చికిత్స పొందుతున్నట్టు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. భగవంతుని దయ, మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో త్వరలోనే పూర్తిగా అనారోగ్యం నుంచి కోలుకుంటానని అమిత్ షా తన ట్వీట్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version