Site icon TeluguMirchi.com

మోడీపై నిప్పులు చెరిగిన బాబు


పశ్చిమ్‌ బంగలోని కోల్‌కతా వేదికగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు సమరశంఖం పూరించాయి. ఒకే వేదికపై చేరి ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టారు. ఈ వేదికలో ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల క్రితం ప్రజలు బీజేపీని గెలిపించారని.. కానీ వారు దేశాన్ని ముంచేశారని ఆరోపించారు.

కాగ త్వరలోనే అమరావతిలో కూడా విపక్షాల ఐక్య వేదిక సభ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు చంద్రబాబు. కోల్‌కతా వేదిక నుంచే జాతీయ స్థాయి నేతలంతా సభకు రావాలని ఆహ్వానం పలికారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఈ సభ ద్వారా దేశం మొత్తానికి తెలియజేయాలనుకుంటున్నారు చంద్రబాబు. హోదా, విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్న చంద్రబాబు ఐక్య వేదిక సభని వేదికగా తీసుకోకున్నారు.

Exit mobile version