Site icon TeluguMirchi.com

కొత్త సమస్యలు సృష్టించవద్దు: చంద్రబాబు

cbn
మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విధానం పై మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తుని ఘటన అత్యంత విషాదరకరమని.. విధ్వంసాల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించిన చంద్రబాబు.. రౌడీయిజం చేసినవారిని అరెస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, రిజర్వేషన్లపై కమిషన్‌ వేశామని, కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించామని వివరించారు. ఇప్పటికే రాష్ట్రం చాలా కష్టాలను ఎదుర్కుంటుందని, కష్టాలో ఉన్న రాష్ట్రంలో మళ్లీ కొత్త సమస్యలు సృష్టించవద్దని కోరారు చంద్రబాబు.

Exit mobile version