Site icon TeluguMirchi.com

చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ షాక్


వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ వద్ద చుక్కెదురైంది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడంటూ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేష్ విజయం సాధించారు. అప్పుడు ఆయన పౌరసత్వంపై వివాదం చెలరేగింది. రమేష్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందాడని ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌తో పాటు, చెన్నమనేని రమేశ్‌ నుంచి కూడా వివరాలు సేకరించిన భారత పౌరసత్వ విభాగం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చెన్నమనేని రమేశ్‌ భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని హోంశాఖ స్పష్టం చేసింది.

Exit mobile version