Site icon TeluguMirchi.com

అన్నవరం ఆలయంలో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. పల్లె , పట్టణం అనే తేడాలు లేకుండా అన్ని చోట్ల కరోనా విలయతాండవం చేస్తుంది. తాజాగా తూర్పు గోదావరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో కరోనా కలకలం రేపింది. దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు.

శుక్రవారం వరకు 10 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. శనివారం 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామి వారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version