Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన సీఎం రమేష్

కరోనా బారిన సినీ , రాజకీయ ప్రముఖులు ఎక్కువ సంఖ్య లో పడుతున్నారు. ఇప్పటికే దీనిబారిన పడి చనిపోయిన వారు కూడా ఉండగా..మరికొంతమంది చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు.

తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని… డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని, ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ను కరోనా‌ వణికిస్తోంది. బాధితులు సంఖ్య ఏకంగా రెండు లక్షలకు చేరువయ్యింది. ఒక్క రోజు వ్యవధిలో మళ్లీ గురువారం ఏకంగా 10,328 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసులు 1,96,789కి చేరాయి. కేవలం 11 రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా బాధితులు పెరగడం గమనార్హం.

Exit mobile version