Site icon TeluguMirchi.com

శిశు సంక్షేమ కమిషనర్‌ ఆఫీసులో కరోనా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇక్కడ మొత్తం 70 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా.. ఇప్పటిదాకా ఏకంగా 32 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. బాధితుల్లో ఎక్కువ మందిని చికిత్స కోసం మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్పించారు.

Exit mobile version