Site icon TeluguMirchi.com

ఏపీ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా ఉదృతి మంగళవారం కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో 3,503 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,86,658 కి చేరింది.

ఇందులో 33,396 కేసులు యాక్టివ్ గా ఉంటె, 7,46,781 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 28 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,481 కి చేరింది.

#COVIDUpdates: 20/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,86,658 పాజిటివ్ కేసు లకు గాను
*7,46,781 మంది డిశ్చార్జ్ కాగా
*6,481 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 33,396#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QRCCbZwqHw— ArogyaAndhra (@ArogyaAndhra) October 20, 2020

Exit mobile version