Site icon TeluguMirchi.com

జగన్ కి వంద రోజుల డెడ్ లైన్ పెట్టిన పవన్ కళ్యాణ్


వైసీపీకి వంద రోజులు గడువు ఇస్తామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బలమైన పథకాలు ప్రవేశపెడితే జనసేన హర్షిస్తుందని, అదే ప్రజలకు ఇబ్బందిపెట్టేవి ఉంటే పోరాడతామని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కదిద్దాల్సిన అంశాలు చాలా ఉన్నాయని. సమీక్ష సమావేశాలకు వచ్చినప్పుడు కొంతమంది నేతలు ఆయా జిల్లాల్లోని సమస్యలను ప్రస్తావించారని , ముందు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న చాలా మంది కార్యకర్తలను కలవాలని నిర్ణయించానని చెప్పారు.

పార్టీ బలోపేతం గురించి చర్చించి కొన్ని రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించామని , త్వరలోనే ఆ కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తామని అన్నారు.

కమిటీలు వాటి ఛైర్మన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Exit mobile version