Site icon TeluguMirchi.com

ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి ఆన్లైన్ టోకెన్లు రద్దు

ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి ఆన్‌లైన్, కంప్యూటర్‌ టోకెన్ల విధానాన్ని కొత్తగా విధుల్లోకి వచ్చిన దుర్గగుడి ఈవో భ్రమరాంబ రద్దు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఉచిత దర్శనం కోసం నేరుగా క్యూలైన్‌లోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రూ.300, రూ.100 టికెట్లను క్యూలైన్ల వద్దే జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. దేవస్థాన ఆవరణలో దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడుని ఈవో భ్రమరాంబ మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది, చైత్రమాస బ్రహ్మోత్సవాల వేడుకల నిర్వహణ, అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

Exit mobile version