రబాడ తొలి రెండు వికెట్లు తీయగా నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్ పంపాడు. ఓపెనర్ రోహిత్ శర్మ, అజింక్యా రహానె ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ టెస్టును గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. విశాఖ పట్టణం, పూణేలలో జరిగిన టెస్టులను భారత్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కనీసం చివరి టెస్ట్ లోనైనా గెలిచి స్వదేశానికి తిరిగి వెళ్లాలని సఫారీ టీం భావిస్తుంది.