Site icon TeluguMirchi.com

కష్టాల్లో భారత్.. విరాట్ అవుట్

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో కోహ్లీ సేన తడబడింది. రాంచి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన భారత్ తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోతుంది. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసి కష్టాల్లో పడింది. మయాంక్ అగర్వాల్ (10), పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) విఫలమయ్యారు.

రబాడ తొలి రెండు వికెట్లు తీయగా నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్ పంపాడు. ఓపెనర్ రోహిత్ శర్మ, అజింక్యా రహానె ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ టెస్టును గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. విశాఖ పట్టణం, పూణేలలో జరిగిన టెస్టులను భారత్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కనీసం చివరి టెస్ట్ లోనైనా గెలిచి స్వదేశానికి తిరిగి వెళ్లాలని సఫారీ టీం భావిస్తుంది.

Exit mobile version