Site icon TeluguMirchi.com

ఆఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

ఆర్థిక సంక్షోభం కారణంగా తిండిగింజల కొరత తలెత్తిన ఆఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం అందించింది. భారత్‌ నుంచి గోధుమల లోడుతో బయలుదేరిన కొన్ని లారీలు నేడు అట్టారీ-వాఘా సరిహద్దు చేరుకున్నాయి. ఈ సరకులు తమ దేశం గుండా వెళ్లేందుకు పాక్‌ ఎట్టకేలకు అనుమతించడంతో అఫ్గాన్‌కు సహాయం చేసే మార్గం సుగమమైంది. అఫ్గాన్‌కు 50వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలు, ఔషధాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మూడు నెలల కిందటే భారత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version