Site icon TeluguMirchi.com

కరోనా తో దుర్గమ్మ ఆలయ అర్చకుడు మృతి

కరోనా మహమ్మారి ఏపీలో హలజడి సృష్టిస్తున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దీనిబారిన అనేకమంది పడగా..మరికొంతమంది మరణిస్తున్నారు. తాజాగా విజయవాడ దుర్గ గుడి ఆలయంలోని సిబ్బంది, ఉన్నతాధికారులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. దుర్గ గుడి ఈవోకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆలయంలో మరో 18 మంది కరోనా బారిన పడ్డారు.

ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా కారణంగా చనిపోయారు. మూడు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన భార్య కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.

Exit mobile version