ఎన్నికల సందర్భంగా ఆసరాఫై అబద్ధపు ప్రచారం చేస్తూ ఓట్లు దండుకోవడానికి గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై సంశయం అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చారు. మునిసిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కమలం జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మంత్రి కేటీఆర్ రాజకీయ సన్యాసి అని, అందుకే మోదీ, అమిత్షాను విమర్శిస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ను కేటీఆర్, కవిత కలిసి చరిత్ర హీనుడ్ని చేశారని ధ్వజమెత్తారు.