Site icon TeluguMirchi.com

టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్.. ముహూర్తం ఫిక్స్ !

కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ముహూర్తం కూడా ఫిక్సయింది. ఈ నెల 24న కిషోర్ చంద్రదేవ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు తెలిపారు.

వాస్తవానికి కిషోర్‌ చంద్రదేవ్‌ ఇప్పటికే టీడీపీలో చేరాల్సి ఉంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కిషోర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చాన్నాళ్లయింది. ఐతే, కిషోర్ చేరికపై మరో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా గజపతి రాజు అలకలో ఉన్నారు. కిషోర్ చేరికపై చంద్రబాబు తనతో చర్చించలేదని కినుక వహించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కిషోర్ చంద్రదేవ్ అశోక్‌గజపతి రాజు నివాసానికి వెళ్లి.. ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాతే ఈ నెల 24న టీడీపీలో చేరబోటున్నట్టు ప్రకటించేశారు.

Exit mobile version