Site icon TeluguMirchi.com

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకి హాజరుకానున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వెళ్ళనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప వెళ్ళి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి చేరుకుంటారు. ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ -మెరిట్స్‌ వద్ద జరిగే అంత్యక్రియల్లో పాల్గొని అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Exit mobile version