Site icon TeluguMirchi.com

పశు వైద్య విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి సీడిరి


తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీడిరి అప్పలరాజు, తిరుపతి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల నిధులతో గ్రంథాలయాన్ని, 9 లక్షలతో డిజిటల్ మినీ సెమినార్ హాల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ లైబ్రరీ నుండే సెమినార్ హాల్ ద్వారా రైతులకు నేరుగా పాఠాలను చెప్పే సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Exit mobile version