Site icon TeluguMirchi.com

తలసానితో టీడీపీ ఎమ్మెల్యే మీటింగ్ .. నో పాలిటిక్స్

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

కాగా దీనిపై తోట త్రిమూర్తులు క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదారాబాద్ వచ్చానని, కొత్తగా మంత్రి అయిన తలసానిని మర్యాదపూర్వకంగా కలిశా అభినందించానని చెప్పారు. అంతేతప్ప, తమ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు. పాతికేళ్లుగా తాను, తలసాని మంచి మిత్రులమని, నాడు టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు

Exit mobile version