Site icon TeluguMirchi.com

జగన్ కి పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రతిదానికి తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ విమర్శిస్తున్నారని, తానేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కుదర్లేదు కాబట్టే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వివరణ ఇచ్చారు. అయినా నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ? కావాలంటే మీరూ చేసుకోండి అంటూ మండిపడ్డారు.

మీరు వ్యాఖ్యలు చేస్తే టీడీపీ వాళ్లు పడతారేమో కానీ, జనసేన నేతలు పడరని ఘాటుగా బదులిచ్చారు. అబ్దుల్ కలాం పేరిట జరిగిన కార్యక్రమంలో మాట్లాడాల్సిన మాటలేనా అవి? అని ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యేలున్న ఓ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న మరో పార్టీపై ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయాల్సిన పనిలేదని, కానీ అలా చేస్తున్నారంటే జనసేన అంటే వైసీపీ భయపడుతున్నట్టే లెక్క అని భాష్యం చెప్పారు.

Exit mobile version