Site icon TeluguMirchi.com

బిజీ బిజీగా జనసేనాని..


జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారు. రేపు బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఆదివారం పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష అలాగే పార్టీలో చేరికల అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారు. ఇక 13వ తేదీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఇక 14వ తేదీ మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

Exit mobile version