Site icon TeluguMirchi.com

జేడీయూలో ‘పీకే’కు పెద్ద పదవి

‘పీకే’ కు జేడీయూలో పెద్ద పదవి లభించింది. ఇక్కడ పీకే అంటే ప్రశాంత్ కిషోర్. ఆయన వైసీపీ ఎన్నికల ప్రచారవ్యూహకర్త పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన జేడీయూలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆయనకి పార్టీలో పెద్ద పదవే లభించింది. పార్టీలో నెంబర్-2 స్థానాన్ని కల్పించారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు.

ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ ని తన రాజకీయ వారసుడిగా ఆయనను అభివర్ణించారు. ఆయన ‘తమ భవిష్యత్తు దారి’ అంటూ కితాబిచ్చారు. ఇక, పీకే నియామకం పార్టీ భవిష్యత్తును మార్చబోతోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నిల వ్యూహాలు రచించడంలో పీకే సిద్దహస్తుడు.

Exit mobile version