Site icon TeluguMirchi.com

కేసీఆర్ పై రేవంత్ ఫైర్ !

revantha reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెదేపా సీనియర్ నేత రేవంత్ మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ తనకు నచ్చిన వారికి భూములను కట్టబెడుతున్నారని, నచ్చని వారిపై కక్ష తీర్చుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ లో రేవంత్ ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికలో రామేశ్వర రావుకు భూములు కేటాయించాలని ఎక్కడా పేర్కొనలేదన్నారు. రామేశ్వర రావు కేసీఆర్ కు సన్నిహితుడు కాబట్టే ఆయనకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించారని రేవంత్ ఆరోపించారు. రామేశ్వర రావు అడిగిన దానిపై క్షణాల్లో సంతకాలు పెడుతున్న సీఎం కేసీఆర్, అనుమతులు లేవని అయ్యప్ప సొసైటీలో ఐదంతస్తుల భవనాలను కూల్చేశారని అన్నారు.

Exit mobile version