Site icon TeluguMirchi.com

కేసీఆర్ దూకుడు మరింత పెంచారు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార దూకుడు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 17 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. శాసన సభ ఎన్నికల్లో ఎలాగైతే విజయ డంఖా మోగించిందో..లోక్ సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేయాలనీ భావిస్తున్నాడు. 16 సీట్లు గెలిచి ఢిల్లీ లో చక్రం తిప్పాలని కేసీర్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసారు.

ప్రతిరోజూ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో.. రెండు సభల్లో పాల్గొనేవిధంగా షెడ్యూల్‌ను ఖరారుచేశారు. వేసవికాలం నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. కరీంనగర్ నుంచి ఈ నెల 17వ తేదీన ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్.. 19వ తేదీన నిజామాబాద్‌లో మరో సభ నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 13 నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారుచేశారు.

ఈ నెల 29న నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం నాలుగు గంటలకు మొదటిసభ నిర్వహిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల సభను ఏర్పాటుచేశారు. కేసీఆర్ సభల షెడ్యూల్ ఇలా ఉంది.

Exit mobile version