మరోవైపు ఈ సంఘటనల నేపథ్యంలోనే అనారోగ్యానికి గురై హాస్పీటల్ లో చికిత్స పొందుతున్న శంకర్రావుకు పరామర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను అడిగి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి గురించి కవిత తెలుసుకున్నారు. శంకర్రావు అనారోగ్యానికి గురై కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పోలీసులు చట్టవిరుద్ధంగా, అక్రమంగా అరెస్టు చేసిన శంకర్రావుకు డీజీపీ క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే… ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా వ్యవహరిస్తుందని ఆమె విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.