Site icon TeluguMirchi.com

విజయసాయి రెడ్డిగారు ఇదేనా మీ అవగాహన ??

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. పార్టీ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అయిన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను వాడుతున్నారని , ప్రభుత్వ సముదాయమైన ప్రజా వేదికను పార్టీ అవసరాల కోసం చంద్రబాబు ఉపయోగిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.
ప్రభుత్వ అతిథి భవనాలు, మీటింగ్ హాల్‌లు ఇతర సదుపాయాలను మిగిలిన పార్టీలు కూడా వినియోగించుకునేందుకు సమాన అవకాశం కల్పించాలని ఈ లేఖలో విజయసాయి కోరారు.

కాగా ఈ లేఖపై ఏపీ మంత్రి యనమల మండిపడ్డారు. కనీస అవగాహన కూడా లేకుండా ఈసీకి విజయసాయిరెడ్డి లేఖ రాశారని అన్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ లు పెట్టుకోవచ్చని,. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.

Exit mobile version