Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్…!

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా విశ్వ భూషణ్‌ హరిచందన్‌ నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.బిశ్వ భూషణ్ సుదీర్ఘకాలంగా సంఘ్‌పరివార్‌తో అనుబంధం కలిగివున్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్‌ హరిచందన్‌ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. విశ్వభూషణ్ ఎంపికతో వరుసగా రెండోసారి కూడా ఒడిశా నుంచే ఏపీకి గవర్నర్‌‌ను నియమించినట్లైంది.

ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ ఇక తెలంగాణకే పరిమితమవ్వనున్నారు. రాష్ట్ర విభజన మొదలుకుని.. తెలంగాణ,ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి దాదాపు పదేళ్లపాటు నరసింహన్ గవర్నర్‌గా ఉన్నారు. గవర్నర్ గా పదేళ్ళు పూర్తి చేసుకున్న నరసింహన్ ను తెలంగాణకు కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Exit mobile version