Site icon TeluguMirchi.com

జగన్ అక్కడ రిలాక్స్ అవుతుండు !


ఎన్నికలకి ముందు, ఎన్నికల సమయంలో బాగా కష్టపడ్డాడు వైఎస్ జగన్. ఎన్నికల తర్వాత మాత్రం రిలాక్స్ అయిపోయాడు. గెలుపుపై ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ప్లాన్ చేసుకొన్నాడు. అత్యంత శీతల ప్రాంతమైన స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు జగన్ ప్లాన్ రెడీ అవుతున్నారు. ఈ సాయత్రం జగన్ స్విట్జర్లాండ్‌కు బయల్దేరనున్నారు. ఐదురోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జగన్‌ విడిది చేయనున్నారు. తిరిగి ఈనెల 27 రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

మరోవైపు, ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. గెలుపుపై ఆయన టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తొంది. జనసేన అధినేత పవన్.. తమ పార్టీ కీలకనేతలు, అభ్యర్థులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా జగన్ రిలాక్స్ కోరుకోవడం.. ఆయనకి గెలుపుపై ఉన్న ధీమాయే అని వైకాపా శ్రేణులు చెప్పుకొంటున్నారు.

Exit mobile version