Site icon TeluguMirchi.com

జగన్‌ వెయ్యి కి.మీ మైలురాయి

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మొదలు పెట్టిన ప్రజా సంకల్ప యాత్ర జోరుగా సాగుతుంది. నేటితో వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని జగన్‌ చేరడంతో ఆ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజక వర్గంలో జగన్‌ పర్యటిస్తూ ఈ మైలురాయిని చేరుకున్నారు. వెంకటగిరి నియోజక వర్గం సైదాపురం చేరుకున్న నేపథ్యంలో జగన్‌ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరింది. దాంతో సైదాపురంలో జగన్‌ అభిమానులు మరియు కార్యకర్తలు భారీ పైలాన్‌ను ఆవిష్కరించడం జరిగింది.

వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్బంగా జగన్‌కు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపేందుకు సైదాపురం చేరుకున్నారు. జగన్‌ పడుతున్న కష్టం, ఆయన ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటున్న తీరును చూస్తున్న ప్రజు వచ్చే ఎన్నికల్లో అధికారం కట్టబెట్టడం ఖాయం అంటూ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి జగన్‌ చేస్తున్న పాదయాత్ర అధికార టీడీపీలో కాస్త గుబులును కలుగజేస్తోంది.

Exit mobile version