ఆ దేశంలో కరోనా ఖతం

తమ దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ముగిసిందని స్లొవేనియా ప్రకటించింది. వైరస్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ శుక్రవారం సరిహద్దులను తెరిచింది.

‘ఐరోపా ఖండంలో మహమ్మారికి సంబంధించి స్లొవేనియాలోనే పరిస్థితి అత్యుత్తమంగా ఉంది. కరోనా ముగిసిందని ప్రకటించేందుకు ఇదే మమ్మల్ని పురిగొల్పింది’ అని ఆ దేశ ప్రధాని జానెజ్‌ జాన్స అన్నారు. కరోనా వైరస్‌తో చిగురుటాకులా వణికిన ఇటలీకి స్లొవేనియా సరిహద్దు దేశం కావడం గమనార్హం.