
సాయి ధరమ్ తేజ్..గత ఏడాది వినాయకచవితి సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే . ఆ తర్వాత చాల నెలల పాటు రెస్ట్ తీసుకొని..ఆరోగ్యం కుదుట పడడంతో సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు.
డబుల్ ఎనర్జీతో పూర్తి ఆరోగ్యంతో ఉన్న సాయిధరమ్.. తన కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొనడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. సుకుమార్ శిష్యుడు దండు కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వరా సినీ చిత్ర యల్లెల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటోంది.









