
హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు విజ్ర్బిస్తున్నాయి. తాజాగా కోఠిలోని ఓ బ్యాంక్ మేనేజర్ కోవిడ్ కారణంగా ప్రాణాలు వదలడం షాక్ కు గురి చేస్తుంది. మేనేజర్ వైరస్ వల్ల చనిపోవడంతో ఆ బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడ కోవిడ్ సోకుతుందేమోనని వారు భయపడుతున్నారు.
గత కొద్ది రోజులుగా బ్యాంకు మేనేజర్ను ఎవరెవరు కలిశారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారందర్నీ ఐసోలేషన్లో ఉంచనున్నారు.









