హైదరాబాద్‌లో 4 జోన్లకే కరోనా

కరోనా వైరస్‌ హైదరాబాద్‌లోని 4 జోన్లకే పరిమితమయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎల్బీనగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్‌ కేసులున్నాయని గుర్తు చేశారు.

అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వలస కూలీలు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు. పాజిటివ్‌ కేసులున్న 4 కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.