
విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన 60ఏళ్ల మహిళ మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన ఈమె ఈ రోజు విశాఖలో మృతిచెందినట్టు తెలిపారు విజయనగరం జిల్లాలో ఇప్పటిదాకా నాలుగు పాజిటివ్ కేసులు ఉన్నాయి.
బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన మహిళ మరణించారు. ఆమె కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. డయాలసిస్ జరుగుతున్న క్రమంలోనే ఇటీవల ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.









