
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటివరకు లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేకపోయారు. ఇక ఇప్పుడు ఎండ దెబ్బకు ఇంట్లో నుండి అడుగు బయటకు వేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు తెలిపింది.
మూడు రోజులపాటు ఎండలు ఉండే అవకాశం ఉందని.. మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలియజేసింది. మే 27 వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడుతుందని , వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అంటున్నారు.
