
కరోనా వైరస్ చికిత్సలో భాగంగా దేశ వ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతిచ్చింది. తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి అవకాశమిచ్చింది. ఈ థెరపీలో కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని సేకరించిన అనంతరం దాని నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు.
ఇలా వేరుచేసిన ప్లాస్మాను అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా బాధితునికి ఎక్కిస్తారు. కోలుకున్న వ్యక్తిలో కరోనా వైరస్పై పోరాడే శక్తి కలిగిన యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి వ్యక్తినుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా బాధితుడికి ఎక్కించడం ద్వారా అతడి శరీరంలోని యాంటీబాడీస్ వృద్ధిచెంది వైరస్పై పోరాడటంలో దోహదపడతాయి.









